యాప్నగరం

స్పెషల్ స్టేటస్‌పై హీరో శివాజీ హైకోర్టులో పిల్

ప్రత్యేక హోదా అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.

TNN 18 Oct 2016, 4:40 pm
ప్రత్యేక హోదా అంశంపై హీరో శివాజీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మోసం చేసిందని అందులో పేర్కొన్నారు. కాగా దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఈ రోజు పిటీషనర్ తరఫున వాదనలు విన్న కోర్టు... తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది. ప్రత్యేక హోదా సాధన సమితీ అధ్యక్షుడి హోదాలో హిరో శివాజీ స్పెషల్ స్టేటస్ పై గత కొంతకాలం నుంచి పోరాడుతున్న విషయం తెలిసిందే.
Samayam Telugu hero sivaji filled a pittition in hc on special status issue
స్పెషల్ స్టేటస్‌పై హీరో శివాజీ హైకోర్టులో పిల్


హోదా సాధన సమితీ హర్షం...

ఇదిలా ఉండగా హీరో శివాజీ వేసిన పిటిషన్ పై ప్రత్యేక హోదా సాధన సమితితో పాటు పలుప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను నేతలు గాలికి వదిలేస్తే.. ప్రజల తరఫున శివాజీ పిటిషన్ దాఖలు చేయడం హర్షనీయమని చలసాని శ్రీనివాస్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.