ఆంధ్రప్రదేశ్కు 'ప్రత్యేక హోదా' విషయమై తెలుగు నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమావాళ్లు ప్రత్యేక హోదా విషయంలో ఏమీ చేయడం లేదని... రాజకీయ పార్టీలు ఆరోపించడం సమంజసంకాదని తెలిపాడు. 'ప్రత్యేక హోదా' అన్నది రెండు పార్టీలకు సంబంధించిన రాజకీయ నిర్ణయమని అన్నాడు. కేంద్రం హోదా విషయాన్ని పక్కన పెట్టిందని... ఈ విషయమై సినిమావాళ్లను దూషించడం విచారకరమన్నారు. మొదటి నుంచే సహాయం కోరి ఉంటే చిత్రపరిశ్రమ తరఫున పోరాడేవారమని తెలిపారు.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు... అందరూ కలిసి వస్తే... నేనే ముందుండి నడిపిస్తానన్నాడు. ప్రధానమంత్రిని కలిసి అడుగుదామన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుందన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు ఏపీ విషయంలో సానుభూతి ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు... అందరూ కలిసి వస్తే... నేనే ముందుండి నడిపిస్తానన్నాడు. ప్రధానమంత్రిని కలిసి అడుగుదామన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుందన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు ఏపీ విషయంలో సానుభూతి ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.