యాప్నగరం

నక్సల్స్ బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

TNN 2 Nov 2016, 11:21 am
ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశమున్న సరిహద్దు ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మొహరించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని ఉత్తరాంధ్ర , ఉదయగోదావరి జిల్లాల ఎజెన్సీలతో పాటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం ఎజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజా ప్రతినిధులు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటించాల్సి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Samayam Telugu hi alert in telugu states for naxal call for bandh
నక్సల్స్ బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్


ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో 30 మంది నక్సల్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా గురువారం రోజు ఏపీ, తెలంగాణ సహా ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాలతో సహా ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించి పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.