యాప్నగరం

ప్రగతి నివేదన సభపై దాఖలైన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

టీఆర్ఎస్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సెప్టెంబర్ 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Samayam Telugu 31 Aug 2018, 1:16 pm
టీఆర్ఎస్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సెప్టెంబర్ 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సభను ఆపాలంటూ గురువారం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం వాదనల్ని వినింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పిటిషన్ దారుడు ప్రస్తావించినట్లుగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో హైకోర్టు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభ నిర్వహించుకోవాలని ఆదేశిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.
Samayam Telugu ప్రగతి నివేదన సభ


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభపై హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలయ్యింది. సభను ఆపాలంటూ లాయర్, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ ఈ పిటిషన్ వేశారు. సభ వల్ల ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం నివేదికను ప్రకటించాలనుకుంటే టెక్నాలజీ సాయంతో.. మాధ్యమాల ద్వారా ఆ పనిని చేయొచ్చని పిటిషన్‌లో ప్రస్తావించారు. సభకు అనుమతి ఇవ్వొద్దని కూడా కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. శుక్రవారం వాదనలు విని సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సెప్టెం బర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ప్రగతి నివేదిన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తుండగా.. సభకు దాదాపు 25లక్షలమంది వస్తారని అంచనా వేస్తోంది. ఈ సభ ద్వారా ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.