యాప్నగరం

ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు పనులు ఆపండి: హైకోర్ట్

ప్రణయ్ విగ్రహం ఏర్పాటుకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ పనులు ఆపాలంటూ హైకోర్టను ఆశ్రయించిన స్థానికుడు.

Samayam Telugu 29 Sep 2018, 9:10 pm
మిర్యాలగూడ‌లో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటుకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాగర్ రోడ్డులో విగ్రహ ఏర్పాటుకు జరుగున్న పనులను నిలిపివేయించాలని కోరుతూ చిన్న వెంకట రమణారావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. అతను దాఖలు చేసిన రిట్ పిటీషన్‌ను విచారించిన కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
Samayam Telugu Untitled


విగ్రహం ఏర్పాటుకు అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని, అప్పటివరకు పనులు చేపట్టరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ.శేషసాయి సూచించారు. కూతురు అమృత వర్షిణి కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో ఆమె తండ్రి మారుతీరావు భర్త ప్రణయ్‌ను హత్యచేయించిన సంగతి తెలిసిందే. కులాంతర వివాహాలకు ప్రతీకగా మిర్యాలగూడ కూడలిలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత కోరిన నేపథ్యంలో పనులు మొదలుపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం పనులు నిలిపివేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.