యాప్నగరం

తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైకోర్టులో తెలంగాణ జనసమితికి ఊరట దొరికింది. ఈ నెల 29న నిర్వహించే సభకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది.

Samayam Telugu 16 Apr 2018, 6:02 pm
హైకోర్టులో తెలంగాణ జనసమితికి ఊరట దొరికింది. ఈ నెల 29న నిర్వహించే సభకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ నెల 29న సరూర్‌నగర్ గ్రౌండ్‌లో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. అయితే అనుమతి ఇవ్వలేమని పోలీసులు, సరూర్‌నగర్ గ్రౌండ్ నిర్వాహకులు చెప్పారు. దీంతో తెలంగాణ జనసమితి నేతలు హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టి కోర్టు... అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పుపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Samayam Telugu TJS


తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి పార్టీని ప్రకటించారు. ఇప్పటికే జెండాను కూడా ఆవిష్కరించి... భారీ సభకు సిద్ధమయ్యారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్టేడియంలో ఏర్పాట్లకు నేతలు సిద్ధమయ్యారు. అలాగే సభను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.