యాప్నగరం

స్వాతి నరేష్ కేసుపై హైకోర్టు ఏమందంటే...

తెలంగాణాలో భువనగిరికి చెందిన స్వాతి - నరేష్ ల ప్రేమకథ సంచలనంగా మారింది.

TNN 1 Jun 2017, 2:27 pm
తెలంగాణాలో భువనగిరికి చెందిన స్వాతి - నరేష్ ల ప్రేమకథ సంచలనంగా మారింది. నరేష్ ది పరువు హత్యగా పోలీసులు తేల్చారు. మే 2న నరేష్ హత్యకు గురికాగా, మే 16న స్వాతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రేమ పెళ్లి చేసుకున్న వారి కథ విషాదాంతంగా మారింది. అయితే స్వాతి ఆత్మహత్యపై పోలీసులకు పలు అనుమానాలు ఉన్నాయి. ఆమె నిజంగా బలవన్మరణానికి పాల్పడిందా లేక ఎవరైనా ఆ వైపుగా ప్రేరేపించారా? అన్నది ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాగా గురువారం స్వాతి నరేష్ ల కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. తమ కొడుకు కనిపించడం లేదంటూ రెండు వారాల క్రితం నరేష్ తల్లిదండ్రులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Samayam Telugu high court hearing on missing naresh case
స్వాతి నరేష్ కేసుపై హైకోర్టు ఏమందంటే...


నరేష్ ను కనిపెట్టి జూన్ 1న తమ ముందు హాజరుపరచాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. నేడు ఆ పిటిషన్ పై మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యలు తీవ్ర కలవరాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. నరేష్ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. నరేష్ ఆచూకీ లభించడంతో విచారణను ముగిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కేసు విషయంలో ఇంకేమైనా సందేహాలు ఉంటే తిరిగి హైకోర్టును ఆశ్రయించవచ్చని నరేష్ తల్లిదండ్రులకు తెలిపారు. అంతకుముందు పోలీసులు స్వాతి - నరేష్ కేసు నివేదికను కోర్టు ముందుంచారు. అందులో స్వాతి ఆత్మహత్య చేసుకుందని, నరేష్ ను స్వాతి తండ్రే చంపాడని పేర్కొన్నారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ రమ్మని స్వాతి-నరేష్ లను ఫోన్లో బెదిరించిన ఆత్మకూరు ఎస్ఐ ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.