యాప్నగరం

తెలంగాణ నూతన ఏజీగా బండ శివానంద ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్‌ (ఏజీ)గా బండ శివానంద ప్రసాద్ నియామకం అయ్యారు. జనగామకు చెందిన శివానంద ప్రసాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

Samayam Telugu 7 Dec 2022, 12:39 am
తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్‌ (ఏజీ)గా బండ శివానంద ప్రసాద్ నియామకం అయ్యారు. జనగామకు చెందిన శివానంద ప్రసాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఏజీగా శివానంద ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఏజీ నియామకానికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం (ఆగస్టు 10) సంతకం చేశారు. మార్చి 26న ఏజీ పదవికి ప్రకాశ్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ప్రకాశ్‌ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. తాజాగా ఆ పదవికి బీఎస్ ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
Samayam Telugu telangana
తెలంగాణ


రాష్ట్ర ప్రభుత్వం తనను ఏజీగా నియమించడం పట్ల శివానంద ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాలకు చెందిన న్యాయవాదిని అడ్వొకేట్ జనరల్‌గా నియమించారని ప్రభుత్వాన్ని కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.