యాప్నగరం

గుత్తాపై హైకోర్టు సీరియస్..

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను నియమించి వారికి మంత్రి హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ అయన గతంలో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేశారు. ఈ అంశం మంగళవారం (సెప్టెంబర్ 12)..

TNN 12 Sep 2017, 3:27 pm
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను నియమించి వారికి మంత్రి హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ అయన గతంలో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేశారు. ఈ అంశం మంగళవారం (సెప్టెంబర్ 12) మరోసారి విచారణకు వచ్చింది. అయితే సదరు పిటిషన్‌ను ఉపసంహ‌రించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ.. గుత్తా తరఫు లాయర్ హైకోర్టును కోరారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Samayam Telugu high court serious on mp gutha sukender reddy
గుత్తాపై హైకోర్టు సీరియస్..


న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా వాడుకోవద్దని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ ఉపసంహ‌రణకు అనుమతి నిరాకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. పిటిషనర్‌ వెనక్కి తగ్గినా తాము విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఈ పిల్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన గుత్తా.. టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

మరోవైపు గుత్తాతో ఎంపీ పదవికి రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తద్వారా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని కూడా టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.