యాప్నగరం

అధిక ఉష్ణోగ్రత: నిజామాబాద్ రికార్డును అధిగమించిన ఆదిలాబాద్

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు.

Samayam Telugu 30 Apr 2019, 10:23 am
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవడంతో నిప్పుల కుంపటిలా మారింది. సూర్యుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 ప్రజలు ఆపసోపాలు పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవి సీజన్‌లో ఇంత అధిక ఉష్ణోగ్రత నమోదవడం కావం ఇదే తొలిసారి. శనివారం నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 45 డిగ్రీలు నమోదు కాగా, దీనిని ఆదిలాబాద్ ఉష్ణోగ్రతలు అధిగమించాయి. హైదరాబాద్‌లోనూ రికార్డు స్థాయిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో నగరంలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోవడంతో ఇళ్లలో నుంచి బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక రాత్రిపూట వేడి గాలులతో ప్రజలు సతమతమవుతున్నారు.
Samayam Telugu temp


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరికొన్ని రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోనూ 43.8 డిగ్రీలు, వరంగల్‌ జిల్లాలో 41.5 డిగ్రీలు, జనగామ జిల్లాలో 42, నాగర్‌కర్నూలు జిల్లాలో 42.3, మెదక్‌ జిల్లాలో 43.3, ఖమ్మం జిల్లాలో 44 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణానికి చెందిన బాలుడు అబ్దుల్లా(9) వడదెబ్బతో మృతి చెందాడు. ఎండల్లో ఆటలాడుకోవడంతో రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన తెనుగు కరణంలక్ష్మి(68), నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నేరెళ్ల వెంకన్న(68), మేడ్చల్‌ జిల్లా గౌడవెల్లికి చెందిన కోరని లింగం(56) వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్‌లో వడదెబ్బకు మూడు రోజుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.