ఏపీ అసెంబ్లీ వద్ద ఇంకా ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూనే ఉంది. రోజాను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా మార్షల్స్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్పీకర్ కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకుంటేనే తాము అనుమతిస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో జగన్ సహా వైకాపా సభ్యులు కాసేపు అసెంబ్లీ ఆవరణ ముందే బైఠాయించారు. అనంతరం అసెంబ్లీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైకాపా ఎమ్మెల్యేలంతా నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. శాసన మండలి నుంచి కూడా వైకాపా సభ్యులు బయటికి వచ్చి ఎమ్మెల్యేలకు జతకలిశారు. అందరూ కలిసి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు.
గవర్నర్ వద్దకు బయలుదేరిన వైకాపా ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ వద్ద ఇంకా ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూనే ఉంది.
TNN 18 Mar 2016, 10:50 am