యాప్నగరం

ఆయేషా మీరా హత్యకేసులో సంచలన తీర్పు

విజయవాడలోని దుర్గా హాస్టల్ లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైంది ఆయేషా మీరా.

TNN 31 Mar 2017, 1:40 pm
విజయవాడలోని దుర్గా హాస్టల్ లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైంది ఆయేషా మీరా. అప్పట్లో ఆ ఘటన తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంచలనం అయ్యింది. ఆ హత్యకేసులో రాజకీయ నాయకుల పిల్లల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పోలీసులు మాత్రం సత్యం బాబు అనే యువకుడిని హత్యకేసులో అరెస్టు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి సత్యం బాబు జైల్లోనే ఉంటున్నాడు. కాగా శుక్రవారం హైకోర్టు ఆయేషా మీరా హత్య కేసులో సంచలన తీర్పును వెలువరించింది. హత్యకు, సత్యంబాబుకు ఏం సంబంధం లేదని, అతను నిర్దోషి అని తేల్చి చెప్పింది కోర్టు. ఎలాంటి ఆధారాలు లేకుండా అతడిని అన్యాయంగా ఎనిమిదేళ్లు జైల్లో ఉంచారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దోషిని విడుదల చేసి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి పోలీసుల అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో అతి త్వరలో సత్యం బాబును పోలీసులు విడుదల చేయనున్నారు.
Samayam Telugu highcourt judgement on ayesha meera murder case sathyam babu
ఆయేషా మీరా హత్యకేసులో సంచలన తీర్పు


విజయవాడలో దుర్గా హాస్టల్ లో అర్థరాత్రి వేళలో ఆయేషా మీరా హత్య జరిగింది. ఆమె హత్య జరిగిన మరుసటి ఉదయం సత్యం బాబు హస్టల్ ఎదురుగా ఉండే టీ కొట్టు దగ్గరికి వచ్చి ఇటూ అటూ తిరుగుతున్నాడు. అతడిన ధనరాజు అనే మరో వ్యక్తి చూశాడు. పోలీసుల విచారణ సమయంలో సత్యం గురించి చెప్పాడు ధనరాజు. అంతకు మించి మరే ఆధారం సత్యం బాబే దోషి అని చెప్పడానికి పోలీసులకు దొరకలేదు. దీంతో సత్యాన్నే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. సత్యం బాబు బంధువులు హైకోర్టుకు వెళ్లారు.

ఆయేషా బేగం తల్లి శంషాద్ బేగం మాత్రం సత్యంబాబు కు ఏమీ తెలియదని చెబుతూ వచ్చింది. తన కూతురి హత్యలో మాజీ మంత్రి కోనేరురంగారాలు బంధువులు, కవితా సౌమ్య కుటుంబం హస్తం ఉందని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.