ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏవోబీలో అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మంగళవారం సాయంత్రం దాటాక బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడికి పాల్పడ్డారు మావోయిస్టులు. ఈ ఘటనలో ఎనిమిది మంది జవాన్లు మరణించగా, 15 మంది దాకా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరణించిన జవానుల మృతదేహాలను పోలీసులు కోరాపుట్ జిల్లాకు తరలించారు. అక్కడ గౌరవ వందనం సమర్పించి బంధువులకు అప్పగించారు. కాగా ఏవోబీలో ఇంకెక్కడైనా బాంబులు ఉన్నాయేమో అని బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అడుగడుగునా పోలీసులు సోదాలు చేస్తున్నారు. చెట్టూ, పుట్టా ఏమీ వదలడం లేదు. అణువణువును జల్లెడపడుతున్నాయి. ఒడిశా,ఏపీ పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడా భద్రతను పెంచారు.
అక్టోబర్ 23న ఏవోబీలోని మల్కాన్ గిరిలో జరిగి ఎన్కౌంటర్ కు ప్రతీకార చర్యగానే మావోలు ఈ దాడి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ ఎన్ కౌంటర్లో 30 మంది మావోయిస్టులను పోలీసులు చంపారు.
అక్టోబర్ 23న ఏవోబీలోని మల్కాన్ గిరిలో జరిగి ఎన్కౌంటర్ కు ప్రతీకార చర్యగానే మావోలు ఈ దాడి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ ఎన్ కౌంటర్లో 30 మంది మావోయిస్టులను పోలీసులు చంపారు.