యాప్నగరం

పరువు హత్య: అదృశ్యమైన నరేష్ కథ విషాదాంతం

స్వాతి- నరేష్‌ల ప్రేమకథ విషాదాంతంగా మారింది. ఆ ప్రేమకథకు విలన్ అమ్మాయి తండ్రేనని తేలింది.

TNN 27 May 2017, 11:13 am
స్వాతి- నరేష్‌ల ప్రేమకథ విషాదాంతంగా మారింది. ఆ ప్రేమకథకు విలన్ అమ్మాయి తండ్రేనని తేలింది. కనిపించకుండాపోయిన నరేష్‌ను స్వాతి తండ్రే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ కేసును పరువు హత్యగా నమోదు చేశారు పోలీసులు. కులాలు వేరు అన్న కారణంగానే స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి వారిద్దరినీ విడదీసి ఇలా పరువు హత్యకు పాల్పడ్డాడు. యాదాద్రికి చెందిన నరేష్, భువనగిరికి చెందిన స్వాతి కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు. వారిద్దరు కులాలు వేరు కావడంతో స్వాతి తండ్రి పెళ్లికి అంగీకరించలేదు. నరేష్ తల్లిదండ్రులు ముంబైలో ఉండడంతో వారి వద్దకి వెళ్లిపోయింది ప్రేమజంట. అక్కడే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అనంతరం స్వాతి తండ్రి ఇద్దరికీ పెళ్లి జరిపిస్తానంటూ భువనగిరికి పిలిపించాడు. మే 1న స్వాతిని తనతో ఇంటికి తీసుకెళ్లాడు. నరేష్ జాడ మాత్రం ఆరోజు నుంచి తెలియరాలేదు.
Samayam Telugu honour killing naresh killed by swathis father
పరువు హత్య: అదృశ్యమైన నరేష్ కథ విషాదాంతం


మే 16న స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. నరేష్ ఏమయ్యాడో మాత్రం నెలరోజులుగా తెలియరాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు జూన్ 1 కల్లా నరేష్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది. కాగా శనివారం ఉదయం నరేష్ హతమార్చినట్టు పోలీసు ఇంటరాగేషన్లో స్వాతి తండ్రి అంగీకరించాడు. అతడిని చంపి, దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. నరేష్ ను చంపింది స్వాతికి చెందిన పొలంలోనే. ఇందులో మరో ఇద్దరు అతనికి సహకరించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడని తెలిసి నరేష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా ఇప్పుడు స్వాతి సూసైడ్ పైనా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమెను ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారా అని కూడా దర్యాప్తు సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.