యాప్నగరం

హుదూద్ బాధితులకు 4750 ఇళ్లు మంజూరు!

విశాఖపట్నం జిల్లాలో హుదూద్ తుపాను వల్ల నష్టపోయినవారికి పునరావాసం కింద 4750 ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం (జూన్ 8) ఆయన నివాసంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు.

Samayam Telugu 8 Jun 2018, 7:53 pm
విశాఖపట్నం జిల్లాలో హుదూద్ తుపాను వల్ల నష్టపోయినవారికి పునరావాసం కింద 4750 ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం (జూన్ 8) ఆయన నివాసంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. డ్రా ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. భీమిలి నియోజకవర్గంలో 520 ఇళ్లలో డ్రా ద్వారా 216 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన గృహాలకు త్వరలో డ్రా నిర్వహించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.
Samayam Telugu ganta


'ఎన్టీఆర్ ప్రత్యేక నిర్మాణ పథకం' కింద బాధితులను ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి ఘంటా లబ్ధిదారులకు ఇళ్లు అందించడానికి చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.