యాప్నగరం

ఆడపిల్ల పుట్టిందని భార్యపై వేధింపులు.. కరెంట్ షాక్

ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి మరీ హింసించాడు ఓ శాడిస్టు భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది.

TNN 4 Feb 2018, 10:21 am
ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి మరీ హింసించాడు ఓ శాడిస్టు భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది. పెనమలూరుకు చెందిన శీలం రాజారత్నం, ప్రశాంతిలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2014లో వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే రాజారత్నం పెళ్లైన కొద్దిరోజుల నుంచి ప్రశాంతిని వేధించడం మొదలుపెట్టాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ కావడంతో ఇంటి నుంచే పనిచేసుకునేవాడు. ఒకవేళ ఎప్పుడైనా బయటకు వెళితే ప్రశాంతిని లోపలి ఉంచి అనుమానంతో ఇంటికి తాళాలు వేసేవాడు. రాజారత్నం తండ్రి కూడా ఈ వికృతచర్యలకు వంత పాడేవాడు. ఇటీవలేలో తల్లిదండ్రుల నుంచి విడిపోయి కానూరులో వేరే కాపురం పెట్టారు. వీరికి తొలిసారి మగపిల్లాడు జన్మించాడు.
Samayam Telugu husband electric shock his wife giving for birth girl child
ఆడపిల్ల పుట్టిందని భార్యపై వేధింపులు.. కరెంట్ షాక్


రెండో కాన్పులో ప్రశాంతి జనవరి 28న ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆడపిల్లను కన్నావని, కట్నం తీసుకురావాలని, లేకపోతే పుట్టింటికి వెళ్లిపోమని వేధింపులను మరింత తీవ్రతరం చేశాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1 రాత్రి ప్రశాంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతికి విద్యుత్ తీగచుట్టి స్విచ్‌ వేశాడు. దీంతో ప్రశాంతి విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులకు పక్కగదిలో ఉన్న ప్రశాంతి తల్లి వచ్చిచూడగా విద్యుత్తు వైర్లు కనిపించాయి. అప్పటికే రాజారత్నం పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మామలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.