యాప్నగరం

భువనగిరి: ప్రియురాలితో భర్త.. భార్య ఏం చేసిందంటే!

చేసేది ఉన్నతోద్యోగమే అయినా.. ఆ భర్త మాత్రం తన నీచ బుద్ధి పోనిచ్చుకోలేదు. పని చేసే చోట మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

Samayam Telugu 7 Jul 2018, 6:12 pm
ఆ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. చేసేది ఉన్నతోద్యోగమే అయినా.. ఆ భర్త మాత్రం తన నీచ బుద్ధి పోనిచ్చుకోలేదు. పని చేసే చోట మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఆ ఇల్లాలు ఎన్నిసార్లు గొడవపడ్డా అతడు మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. విధుల నుంచి తప్పించినా, సెలవుపై పంపించినా వక్ర బుద్ధి పోనిచ్చుకోలేదు. తాజాగా అతడు తన ప్రియురాలితో ఓ ఇంట్లో ఏకాంతంగా ఉండగా.. ఆ ఇల్లాలు వారిద్దర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu Bhongir


యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏవోగా పనిచేస్తున్న హరిప్రసాద్‌కు 2002లో నిర్మలతో వివాహం జరిగింది. ఈమె బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే.. కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తించే మరో మహిళతో హరిప్రసాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

హరిప్రసాద్ వివాహేతర సంబంధం విషయమై నిర్మల పలుమార్లు గొడవ పడి పెద్దల ముందు పంచాయతీ పెట్టించారు. అయినా అతడు తన పద్ధతి మార్చుకోకపోవడంతో కొద్ది కాలం కిందటే అతణ్ని విధుల నుంచి తప్పించారు. గతంలోనూ ఇదే విషయంపై పెద్ద గొడవ జరగడంతో అతణ్ని సుదీర్ఘ కాలంపాటు సెలవుపై పంపించారు.

అయినా తన పద్ధతి మార్చుకోని హరిప్రసాద్.. తరచూ రహస్యంగా తన ప్రియురాలిని కలుస్తున్నాడు. అంతేకాకుండా నిర్మలను, పిల్లలను వేధిస్తున్నాడు. విషయంపై విసుగు చెందిన నిర్మల అతడి కదలికలపై నిఘా పెట్టింది. ఓ ఇంట్లో ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను కుటుంబసభ్యులతో కలిసి బయటకి ఈడ్చుకొచ్చి వెంటాడి తరిమికొట్టింది. ఆ తర్వాత పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.