యాప్నగరం

భార్య కాపురానికి రాలేదని ఏం చేశాడో తెలుసా...

హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. భార్య కాపురానికి రాలేదనే కోపంతో దారుణానికి ఒడిగట్టాడు.

TNN 6 Feb 2018, 10:30 am
హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. భార్య కాపురానికి రాలేదనే కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై పెట్రోల్‌పై పోసి నిప్పంటించబోయాడు. రెయిన్ బజార్‌లో జరిగిన దారుణం ఆలస్యంగా బయటపడింది. చమన్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్ కరీం ఆటో నడుపుతున్నాడు. రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. భార్యతో గొడవపడి... ఆమెపై దాడి చేసేవాడు. కరీం వేధింపులు తట్టుకోలేక ఆమె వేరుగా ఉంటోంది. ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తోంది. అయినా అతడు భార్యను వదల్లేదు. అక్కడికీ వెళ్లి నానా రచ్చ చేసేవాడు
Samayam Telugu husband petrol attack on wife
భార్య కాపురానికి రాలేదని ఏం చేశాడో తెలుసా...


నిన్న కూడా మద్యం సేవించిన కరీం... ఉదయం భార్య దగ్గరకు వెళ్లాడు. ఇంటికి తిరిగి రావాలని గొడవకు దిగాడు. ఆమె రానని తెగేసి చెప్పింది. కోపంతో ఊగిపోయిన కరీం ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆమె తప్పించుకోబోగా... వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోశాడు. నిప్పంటించబోగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అయితే మంటలు ఇంటికి అంటుకున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... మంటలార్పారు. కరీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.