హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచంలోనే నాణ్యమైన సేవలు అందిస్తోన్న విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్పోర్టును ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) గుర్తించింది. 300కి పైగా విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తొలి స్థానంలో నిలవడం విశేషం. ఏడాదిలో 5-15 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయ కేటగిరీలో 2016కు గానూ ఆర్జీఐఏ ఈ అవార్డు సాధించింది. అక్టోబర్లో మారిషస్లో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నారు.
2009 నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్టు క్రమంగా మెరుగవుతోందని తెలిపింది. ఐదు పాయింట్ల స్కేలుపై 2009లో 4.4 పాయింట్లు సాధించిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గతేడాది 4.9 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తొమ్మిదేళ్లుగా సేవలు అందిస్తోంది. గతేడాది ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించిన వారి సంఖ్య 20 శాతం పెరిగింది. ఈ సర్వేలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ రెండో స్థానంలో నిలిచింది.
2009 నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్టు క్రమంగా మెరుగవుతోందని తెలిపింది. ఐదు పాయింట్ల స్కేలుపై 2009లో 4.4 పాయింట్లు సాధించిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గతేడాది 4.9 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తొమ్మిదేళ్లుగా సేవలు అందిస్తోంది. గతేడాది ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించిన వారి సంఖ్య 20 శాతం పెరిగింది. ఈ సర్వేలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ రెండో స్థానంలో నిలిచింది.