యాప్నగరం

ట్యాంక్ బండ్‌పై షాకింగ్ యాక్సిడెంట్.. పాదచారిని లాక్కెళ్లిన బైక్

ట్యాంక్ బండ్ మీద షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న పాదచారిని.. వేగంగా దూసుకొచ్చిన బైక్ లాక్కెళ్లింది.

Samayam Telugu 19 Jul 2018, 1:46 pm
హైదరాబాద్: ట్యాంక్ బండ్ మీద షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న పాదచారిని.. వేగంగా దూసుకొచ్చిన బైక్ లాక్కెళ్లింది. ట్యాంక్ బండ్ మీద ఇద్దరు పాదచారులు జిబ్రా క్రాసింగ్ మీదుగా రోడ్డు దాటుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్కాన్‌లో పురోహితులుగా పని చేస్తోన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. వారిద్దరూ బస్సు వస్తోన్న విషయాన్ని గమనించారు. ఈలోగా రోడ్డు దాటేయొచ్చు అనుకున్నారు. కానీ దాని పక్క నుంచి బైక్ వస్తున్నట్టు గుర్తించలేకపోయారు.
Samayam Telugu Hyderabad-accident


ఒకరు వేగంగా రోడ్డు దాటగా.. మరో వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. బైక్ వేగంగా వస్తుండటంతో బ్రేక్ వేసినా ఆగలేదు. పురోహితుడు బైక్ ముందు భాగంపై పడిపోగా.. అలా కొద్ది దూరం లాక్కెళ్లింది. బైక్ బ్యాలెన్స్ తప్పితే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అదృష్టం కొద్దీ అతడు కొద్దిపాటి గాయాలతో తప్పించుకున్నాడు. వెంటనే అతణ్ని సమీపంలోని హాస్పిల్‌కు తరలించారు.
గత శనివారం ఈ ఘటన జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీని గురువారం విడుదల చేశారు. ఈ యాక్సిడెంట్‌తో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు.. వాహనం నడిపేటప్పుడు పాదచారులను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.