టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గవర్నర్ నరసింహన్కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి.. ఈ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీలో అవినీతి రాజ్యమేలుతోందని.. వెంటనే విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేశారు. గవర్నర్ను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ డీజీపీ దినేష్రెడ్డి ఉన్నారు.
రాజకీయ ప్రమేయంతోనే టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. గత నెలలో టికెట్ల కుంభకోణం జరిగినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ స్కాంపై విజిలెన్స్, ఈడీని విచారణకు ఆదేశించేలా చూడాలని గవర్నర్ను కోరామన్నారు. అక్రమార్కులు టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతూ రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
రాజకీయ ప్రమేయంతోనే టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. గత నెలలో టికెట్ల కుంభకోణం జరిగినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ స్కాంపై విజిలెన్స్, ఈడీని విచారణకు ఆదేశించేలా చూడాలని గవర్నర్ను కోరామన్నారు. అక్రమార్కులు టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతూ రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.