యాప్నగరం

నిఘా నేత్రంలో ధూంధాంగా లష్కర్ బోనాలు

సికింద్రాబాద్‌లోని లష్కర్ బోనాల జాత ధూంధాంగా జరుగుతోంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

TNN 9 Jul 2017, 9:40 am
సికింద్రాబాద్‌లోని లష్కర్ బోనాల జాత ధూంధాంగా జరుగుతోంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల దర్శనార్థం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేసారు. ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తుల రద్దీ పెరిగింది.
Samayam Telugu hyderabad celebrates ujjaini mahankali temple bonalu jathara
నిఘా నేత్రంలో ధూంధాంగా లష్కర్ బోనాలు


మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారి తొలిబోనం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా బోనాలు జరుపుతున్నామన్నారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాక ఆలయంలో భక్తుల తాకిడి పెరిగిందని, విజయవాడ, ఢిల్లీలో కూడా బోనాల వేడుకలు జరుపుతున్నామని వెల్లడించారు. కాగా.. అమ్మవారిని గత ఏడాది 25 లక్షల మంది దర్శించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 35 లక్షలకు పెరిగే అవకాశముందని అంచనా.

ఈ ఏడాది బోనాల పండుగకు 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయం పరిసరాల్లో 130 సీసీ కెమెరాలను అమర్చారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో షీటీమ్స్‌, టాస్క్‌ఫోర్స్‌తో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం లష్కర్ బోనాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.