జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం (జులై 4) సమన్లు జారీచేసింది. ఓ మీడియా సంస్థ యజమాని దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జులై 24న స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ కోర్టుకు హాజరుకావాలని తెలిపింది. సివిల్ కోర్టు 3వ అదనపు జడ్జి ఈ సమన్లు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటి శ్రీ రెడ్డి తన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ పవన్.. ఆమె వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన చానెళ్లపై విమర్శలు చేశారు.
అయితే ఆ వ్యాఖ్యలను ఓ చానెల్ మరీ ఎక్కువగా ప్రసారం చేసిందని ఆగ్రహించిన పవన్ దాని యజమానిని ఉద్దేశిస్తూ అనుచిత ట్వీట్లు చేశారు. దీంతో ఆ మీడియా సంస్థ యజమాని పవన్కు.. తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తనకు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులకు పవన్ స్పందించకపోవడంతో ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అకారణంగా కామెంట్ చేయడమే కాకుండా సంస్థ పరువుకు భంగం కలిగించారని పవన్ కళ్యాణ్పై పది కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి.
అయితే ఆ వ్యాఖ్యలను ఓ చానెల్ మరీ ఎక్కువగా ప్రసారం చేసిందని ఆగ్రహించిన పవన్ దాని యజమానిని ఉద్దేశిస్తూ అనుచిత ట్వీట్లు చేశారు. దీంతో ఆ మీడియా సంస్థ యజమాని పవన్కు.. తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తనకు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులకు పవన్ స్పందించకపోవడంతో ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అకారణంగా కామెంట్ చేయడమే కాకుండా సంస్థ పరువుకు భంగం కలిగించారని పవన్ కళ్యాణ్పై పది కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి.