యాప్నగరం

హైదరాబాద్: కాలేజ్ బస్సు బీభత్సం.. ఇంటర్ విద్యార్థిని మృతి

ఓ విద్యార్థినిని చైతన్య కాలేజీ బస్సు ఢీకొట్టిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జాతీయ రహదారి చోటుచేసుకుంది. దీంతో ఆ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది.

Samayam Telugu 29 Oct 2018, 10:58 am
ఓ విద్యార్థినిని చైతన్య కాలేజీ బస్సు ఢీకొట్టిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జాతీయ రహదారి చోటుచేసుకుంది. దీంతో ఆ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని ఇంటర్ చదువుతున్న రమ్యగా గుర్తించారు. తమ కళ్లముందే స్నేహితురాలు ప్రాణాలు కోల్పోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి చెందిన పలు బస్సులను ధ్వంసం చేశారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. బస్సును రోడ్డుపైనే ఆపేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు భారీగా చేరుకుని, పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై ఈ ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
Samayam Telugu kukatpalli


కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం సమీపంలో విద్యార్థిని రమ్య రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన చైతన్య కాలేజీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.