అక్రమ నిర్మాణాల కూల్చివేత.. పోలీసులపై రాళ్ల దాడి
హైదరాబాద్లోని గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలోని కేశవనగర్లో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారి తీశాయి.
Samayam Telugu 31 Jul 2018, 1:11 pm
హైదరాబాద్లోని గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలోని కేశవనగర్లో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారి తీశాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వెళ్లిన రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తాము 30 ఏళ్లుగా నివసిస్తోన్న ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చివేయనివ్వకుండా అధికారులను నిర్బంధించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీ ఛార్జీ చేశారు.
ఇదిలా ఉంటే, ఇళ్లను కోల్పోతున్న స్థానికులకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతల్ని అరెస్టు చేయడంతో మరింత ఆగ్రహానికి గురైన బాధితులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
కాగా, ఇళ్లు కూల్చివేత ఘటనలో స్థానికులు రెండు వర్గాలుగా విడిపోవడం గమనార్హం. ఒక వర్గం కూల్చివేతను అడ్డుకోగా.. మరొక వర్గం అధికారులకు సహకరించింది. కేశవనగర్లో కొందరికి నాలుగైదు ఇళ్లు ఉన్నాయని.. అద్దెలు, స్థలం పోతుందనే ఉద్దేశంతోనే వారు కూల్చివేతను అడ్డుకుంటున్నారని ఒక వర్గం ఆరోపిస్తోంది.
వాస్తవానికి కొంత మంది ఇక్కడున్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 100 గజాల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. ఈ స్థలం ఇప్పుడు కోట్లు పలుకుతోంది. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తే 60 గజాల ఇల్లు మాత్రమే వస్తుంది. అందుకే కావాలని ఇలాంటి వాళ్లు కూల్చివేతను అడ్డుకుంటారని ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. కబ్జాలకు పాల్పడి ఇళ్లు నిర్మించుకున్నవారికి బీజేపీ నేతలు సహకరించడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై శేరిలింగంపల్లి తహసీల్దార్ తిరుపతిరావు మాట్లాడుతూ.. ‘కేశవనగర్ సర్వే నంబరు 37/2లో ఉన్న రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించింది. అందువల్ల ఈ భూమిలో అక్రమంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నాం’ అని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఇళ్లను కోల్పోతున్న స్థానికులకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతల్ని అరెస్టు చేయడంతో మరింత ఆగ్రహానికి గురైన బాధితులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
కాగా, ఇళ్లు కూల్చివేత ఘటనలో స్థానికులు రెండు వర్గాలుగా విడిపోవడం గమనార్హం. ఒక వర్గం కూల్చివేతను అడ్డుకోగా.. మరొక వర్గం అధికారులకు సహకరించింది. కేశవనగర్లో కొందరికి నాలుగైదు ఇళ్లు ఉన్నాయని.. అద్దెలు, స్థలం పోతుందనే ఉద్దేశంతోనే వారు కూల్చివేతను అడ్డుకుంటున్నారని ఒక వర్గం ఆరోపిస్తోంది.
వాస్తవానికి కొంత మంది ఇక్కడున్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 100 గజాల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. ఈ స్థలం ఇప్పుడు కోట్లు పలుకుతోంది. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తే 60 గజాల ఇల్లు మాత్రమే వస్తుంది. అందుకే కావాలని ఇలాంటి వాళ్లు కూల్చివేతను అడ్డుకుంటారని ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. కబ్జాలకు పాల్పడి ఇళ్లు నిర్మించుకున్నవారికి బీజేపీ నేతలు సహకరించడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై శేరిలింగంపల్లి తహసీల్దార్ తిరుపతిరావు మాట్లాడుతూ.. ‘కేశవనగర్ సర్వే నంబరు 37/2లో ఉన్న రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించింది. అందువల్ల ఈ భూమిలో అక్రమంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నాం’ అని చెప్పారు.