యాప్నగరం

భాగ్యనగర వాసులకు మెట్రో రైల్ బంఫర్ ఆఫర్!

మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తోన్న భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది.

TNN 6 Dec 2017, 5:51 pm
మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తోన్న భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. స్మార్ట్ కార్డు కొనుగోలు చేసిన వారికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు టికెట్ ధరపై పది శాతం రాయితీ ఇస్తామని అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం ద్వారా స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ చేసుకునే వారికి రూ. 20 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మెట్రో స్టేషన్లలో రద్దీని తట్టుకోవడానికి స్మార్ట్ కార్డులను ప్రోత్సహిస్తున్నారు. వీటిని టీసవారీ, పేటీఎం, హెచ్ఎంఆర్ ప్యాసింజర్ వెబ్‌సైట్‌ల ద్వారా రీచార్జ్ చేసుకునే వీలుంది.
Samayam Telugu hyderabad metro rail announces 10 discount on smart card trips
భాగ్యనగర వాసులకు మెట్రో రైల్ బంఫర్ ఆఫర్!


రోజూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మియాపూర్, నాగోల్, అమీర్‌పేటలో తొలి రైలు ఉదయం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది.


రాత్రి పది గంటలకు ఈ స్టేషన్లోనే చివరి రైలు బయల్దేరుతుంది. మియాపూర్-అమీర్‌పేట మధ్య ప్రతి 8 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడుపుతున్నారు. నాగోల్-అమీర్‌పేట మధ్య 16 నిమిషాలకు ఒక రైలు తిరుగుతోందని ఎల్ అండ్ మెట్రో రైల్ తెలిపింది.

ప్రధాని చేతుల మీద నవంబర్ 28న మెట్రో సేవలు ప్రారంభం కాగా.. మరుసటి రోజు నుంచి సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాయి. మెట్రోకు ఊహించిన దానికంటే నగరవాసుల నుంచి భారీ స్పందన వస్తోంది. తొలి రోజు దాదాపు రెండు లక్షల మంది మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.