యాప్నగరం

వాజ్‌పేయి కోసం ఎమ్మెల్యే రాజాసింగ్ యాగం

భారత మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

Samayam Telugu 16 Aug 2018, 2:23 pm
భారత మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాజ్‌పేయి ఆరోగ్యం మరింతగా క్షీణించిందని గురువారం ఉదయం ఎయిమ్స్ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటికే గ్వాలియర్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌కే చేరుకున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని, ఆయనికి భగవంతుడు ఆయుష్షును ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్‌లోని ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక యాగం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.