ఆచారం పేరుతో 13 ఏళ్ల అమ్మాయి చేత 68 రోజులు ఉపవాసం చేయించి ఆమె మృతికి కారణమయ్యారు కొందరు మతగురువులు, ఆమె తల్లిదండ్రులు. ఆరాధన ఉపవాస దీక్ష పూర్తి చేశాక గుండె ఆగిపోయి మరణించింది. ఆమె వయసు 13 ఏళ్లు. ఆమెతో నిర్భంధంగా ఉపవాసం చేయించి మరణించేలా చేశారని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. తాజాగా ఆ కేసులో నిర్భంధంగా ఉపవాసం చేయించినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, దర్యాప్తు చేయడానికి ఏమీ లేదని కేసును మూసివేస్తున్నట్టు బాలల హక్కుల సంఘానికి తెలియజేశారు. దీనిపై బాలల హక్కుల సంఘం సభ్యులు స్పందిస్తూ... తాము కోర్టుకు వెళతామని, ఈ విషయాన్ని విడిచిపెట్టమని చెప్పారు. పోలీసులు కేవలం దీనిని మతాచారాలకు సంబంధించిన విషయంగా చూస్తున్నారని అన్నారు. ఫిర్యాదు చేసిన తమను కానీ, ఆరాధన ఇంటి దగ్గర నివసించే స్థానికులను కానీ విచారించకుండానే కేసును మూసి వేయడం తగదన్నారు. తమ కూతురు చేస్తున్న ఉపవాస దీక్ష గురించి ఆమె తల్లిదండ్రులు ఓ హిందీ పత్రికకు ప్రకటన కూడా ఇచ్చారని, అంతకన్నా ఆధారం ఇంకేమి ఉంటుందని వారు ప్రశ్నించారు.
సికింద్రాబాద్ కు చెందిన బంగారు నగల వ్యాపారి లక్ష్మీచంద్ మనీష్ సమదరియా కూతురు ఆరాధన (13). వ్యాపారంలో నష్టం రావడంతో ఆరాధన చేత ఉపవాస దీక్ష చేయించారు. ఆరాధన సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. దీక్ష పూర్తయ్యాక ఆమె కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లెలోపే మరణించింది. ఈ దీక్షలో నీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వరు. ఆ నీళ్లు కూడా కేవలం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలోనే తాగాలి. దీంతో ఆమె పేగులు, కిడ్నీలు ఎండిపోయాయి. అవయవాలన్నీ పాడైపోయాయి. గుండె పనిచేయడం ఆగిపోయి బాలిక మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
సికింద్రాబాద్ కు చెందిన బంగారు నగల వ్యాపారి లక్ష్మీచంద్ మనీష్ సమదరియా కూతురు ఆరాధన (13). వ్యాపారంలో నష్టం రావడంతో ఆరాధన చేత ఉపవాస దీక్ష చేయించారు. ఆరాధన సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. దీక్ష పూర్తయ్యాక ఆమె కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లెలోపే మరణించింది. ఈ దీక్షలో నీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వరు. ఆ నీళ్లు కూడా కేవలం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలోనే తాగాలి. దీంతో ఆమె పేగులు, కిడ్నీలు ఎండిపోయాయి. అవయవాలన్నీ పాడైపోయాయి. గుండె పనిచేయడం ఆగిపోయి బాలిక మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.