హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా వరదలకి గురైన లోతట్టు ప్రాంతాల్లో ఆర్మీ సైనికులు సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రికే నగరానికి చేరుకున్న ఆర్మీ బృందాలు శనివారం సిటీలోని బేగంపేట, నిజాంపేట, హకీంపేట, ఆల్వాల్ వంటి ప్రాంతాల్లో సహాయకచర్యల్లో నిమగ్నమైనట్టుగా డిఫెన్స్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
వరద బాధితుల సహాయార్థం కోసం జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్లోనే ఓ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఆర్మీ అధికారులు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) విభాగాలతో కలిసి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తోంది ఈ కంట్రోల్ రూమ్.
ఇదిలావుంటే, ఇప్పటికీ సిటీలోని కొన్ని లోతట్టు ప్రాంతాల వారికి మిగతా వారితో పూర్తిగా సంబంధాలు తెగిపోయే వున్నాయి. జీహెచ్ఎంసీతోపాటు కొన్ని ఎన్జీవో సంస్థలు వరదల కారణంగా ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల వారికి ఆహారం సరఫరా చేస్తున్నాయి.
వరద బాధితుల సహాయార్థం కోసం జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్లోనే ఓ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఆర్మీ అధికారులు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) విభాగాలతో కలిసి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తోంది ఈ కంట్రోల్ రూమ్.
ఇదిలావుంటే, ఇప్పటికీ సిటీలోని కొన్ని లోతట్టు ప్రాంతాల వారికి మిగతా వారితో పూర్తిగా సంబంధాలు తెగిపోయే వున్నాయి. జీహెచ్ఎంసీతోపాటు కొన్ని ఎన్జీవో సంస్థలు వరదల కారణంగా ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల వారికి ఆహారం సరఫరా చేస్తున్నాయి.