యాప్నగరం

భాగ్యనగరవాసులకు విజ్ఞ‌ప్తి.. రోడ్లపై వెళుతున్నారా జర జాగ్రత్త

హైదరాబాద్‌ పరిశుభ్రతపై జీహెచ్‌ఎంసీ ఫోకస్. పరిశుభ్రత కోసం ఓ నిబంధనను ఆచరణలోకి తెచ్చింది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తే కుదరదు. జరిమానా కట్టి తీరాల్సిందే.

Samayam Telugu 3 Jul 2019, 4:07 pm
భాగ్యనగరవాసులకు విజ్ఞ‌ప్తి.. రోడ్లపై వెళుతున్నారా జర జాగ్రత్త. ఎందుకనుకుంటున్నారా.. ఇకపై ఎక్కడపడితే అక్కడ.. ఇష్టం వచ్చినట్లు ఉమ్మి వేస్తే కుదరదు. రోడ్డు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానా మోత మోగుతుంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నేరుగా మీ దగ్గరకు వచ్చిన చేతిలో ఓ స్లిప్ తెచ్చి పెడతారు. ఆ ఫైన్ కచ్చితంగా కట్టి తీరాల్సిందే. ఈ నిబంధనను ఆచరణలోకి తెచ్చింది జీహెచ్‌ఎంసీ.. ఇకపై ఉమ్మి వేస్తే కుదరదంటూ ఆర్టీసీ డ్రైవర్‌కు జరిమానా విధించి వార్నింగ్ బెల్స్ పంపింది.
Samayam Telugu rtc


ఓ ఆర్టీసీ డ్రైవర్‌ బుధవారం ఉమ్మి వేసినందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది జరిమానా విధించింది. ఉదయం పారిశుద్ధ్యం కార్మికులు రోడ్లు ఊడ్చేశారు. కొద్దిసేపటి తర్వాత కుషాయి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (AP28Z3676)డ్రైవర్ జగదీష్ రోడ్డుపై ఉమ్మి వేశాడు. డ్రైవర్ ఉమ్మేయడాన్ని గమనించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే అతడికి రూ.100 జరిమానా విధించారు. ఆ డబ్బు వెంటనే కట్టమని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్ ఆ ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.
నగరంలో ఇకపై ఎవరైనా ఉమ్మి వేస్తే జరిమానా తప్పదని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. జరిమానా మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాబట్టి భాగ్యనగరవాసులారా జాగ్రత్త.. ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తే మీకు జరిమానా మోత మోగడం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.