యాప్నగరం

Hyderabad Twin Bomb Blast Case: దోషులకు నేడు శిక్షలు ఖరారు

ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులు 2007 ఆగస్టు 25న గోకుల్‌ఛాట్‌, లుంబినీ పార్కుల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలో 44 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Samayam Telugu 10 Sep 2018, 9:11 am
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసుల దోషులకు సోమవారం శిక్షలు ఖరారు కానున్నాయి. మరో నిందితుడిపై తీర్పు వెలువరించనుంది. ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులు 2007 ఆగస్టు 25న గోకుల్‌ఛాట్‌, లుంబినీ పార్కుల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనల్లో 44 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆగస్టు 5నే ఈ కేసులో వాదనలు ముగియడంతో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సెప్టెంబరు 4న తీర్పు వెలువరించారు. ఎనిమిది మంది నిందితుల్లో కేవలం ఇద్దర్ని మాత్రమే దోషులుగా తేల్చింది. లుంబీపార్క్‌ లేజర్ షో వద్ద, దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద బాంబులు అమర్చిన అనీక్‌ షఫీఖ్ సయీద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలను దోషులుగా పరగణించిన న్యాయస్థానం, నేడు వీరికి శిక్షలు ఖరారు చేయనుంది.
Samayam Telugu హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసు


ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌, ఫరూక్‌ షర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. మరో నిందితుడు మహ్మద్‌ తారీఖ్‌ అంజూమ్‌ ఎహసాస్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు, సోమవారం దీనిపై నిర్ణయం వెలువరించనుంది. ఇండియన్ ముజాయిద్దీన్ వ్యవస్థాపకుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌, అతడి సోదరుడు ఇక్బాల్‌ భత్కల్‌, అమీర్‌ రెజాఖాన్‌లు పరారీలో ఉన్నారు. దోషులకు శిక్షల ఖరారు నేపథ్యంలో న్యాయస్థానం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు నేరస్థులకు ఉరిశిక్ష విధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.