తన పెళ్లికి ఆహ్వానం పలుకుతూ హైదరాబాద్ యువకుడొకరు ప్రింట్ వేయించిన పెళ్లి కార్డు హాట్ టాపిక్గా మారింది. తన పెళ్లి కానుకగా ప్రత్యేక కోరిక కోరడమే అందుక్కారణం. తమ వివాహానికి వచ్చే అతిథులందరూ తన పెళ్లి కానుకగా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోదీకే ఓటేస్తామని మాటివ్వాలని కోరాడు. ఈ అరుదైన పెళ్లి కార్డుతో హైదరాబాద్కు చెందిన ముఖేశ్ యండే (27) వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. అతడు ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ‘జెన్కో’లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ముఖేశ్.. తనకు తాను మోదీ భక్తుడుగా చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఈ అరుదైన పెళ్లి కార్డును ముద్రించడం అతడికి అంత తేలికేం కాలేదు. కుటుంబ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. తమ కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడుతుందేమో అనే ఆందోళనతో వారు అభ్యంతరం చెప్పారు. కానీ, పట్టు వదలని ముఖేశ్ అందరినీ ఒప్పించాడు.
‘మోదీని వ్యతిరేకించేవారు ఇక్కడ చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కానీ, నరేంద్ర మోదీ అంటే నాకు చచ్చేంత అభిమానం. స్వచ్ఛ భారత్ లాంటి వైవిధ్య కార్యక్రమాలను ప్రవేశపెట్టిన నేత ఆయన. అలాంటి కార్యక్రమాల కోసం నా వంతు సహకారాన్ని అందిస్తున్నా. ప్రతి శనివారం కొంత మంది మిత్రులతో కలిసి మా ఆఫీస్లో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నా. నా అభిమాన నాయకుడికి ఉడతా భక్తిగా ఇప్పుడు ఈ అప్పీల్ చేస్తున్నా’ అని ముఖేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికార సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ.. ఇక్కడి అధికార పార్టీకి కాకుండా, మోదీకి ఓటేయాలని కోరడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించవచ్చు. కానీ, ముఖేశ్ చెప్పే కారణం కూడా పలువురిని ఆకట్టుకుంటోంది. విషయం తెలుసుకున్న పలువురు స్నేహితులు, బంధుమిత్రులు ముఖేశ్ను అభినందిస్తున్నారు.
‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ పార్టీకే మద్దతిచ్చా. కానీ, దేశానికి సంబంధించిన ఎన్నికల విషయంలో స్థానిక కారణాలను పెద్దగా పట్టించుకోను. దేశానికి ఏది మంచో అదే చేస్తా. మోదీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉంది, పురోగతి సాధిస్తోంది. అందుకే ఆయనకు మద్దతిస్తా’ అని ముఖేశ్ చెప్పాడు. మరి ముఖేశ్కు కోరిన కానుకలు దక్కాయా తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 21 (పెళ్లి ముహూర్తం) వరకు ఆగాల్సిందే.
Read this in English
‘మోదీని వ్యతిరేకించేవారు ఇక్కడ చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కానీ, నరేంద్ర మోదీ అంటే నాకు చచ్చేంత అభిమానం. స్వచ్ఛ భారత్ లాంటి వైవిధ్య కార్యక్రమాలను ప్రవేశపెట్టిన నేత ఆయన. అలాంటి కార్యక్రమాల కోసం నా వంతు సహకారాన్ని అందిస్తున్నా. ప్రతి శనివారం కొంత మంది మిత్రులతో కలిసి మా ఆఫీస్లో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నా. నా అభిమాన నాయకుడికి ఉడతా భక్తిగా ఇప్పుడు ఈ అప్పీల్ చేస్తున్నా’ అని ముఖేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికార సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ.. ఇక్కడి అధికార పార్టీకి కాకుండా, మోదీకి ఓటేయాలని కోరడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించవచ్చు. కానీ, ముఖేశ్ చెప్పే కారణం కూడా పలువురిని ఆకట్టుకుంటోంది. విషయం తెలుసుకున్న పలువురు స్నేహితులు, బంధుమిత్రులు ముఖేశ్ను అభినందిస్తున్నారు.
‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ పార్టీకే మద్దతిచ్చా. కానీ, దేశానికి సంబంధించిన ఎన్నికల విషయంలో స్థానిక కారణాలను పెద్దగా పట్టించుకోను. దేశానికి ఏది మంచో అదే చేస్తా. మోదీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉంది, పురోగతి సాధిస్తోంది. అందుకే ఆయనకు మద్దతిస్తా’ అని ముఖేశ్ చెప్పాడు. మరి ముఖేశ్కు కోరిన కానుకలు దక్కాయా తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 21 (పెళ్లి ముహూర్తం) వరకు ఆగాల్సిందే.
Read this in English