యాప్నగరం

నేను తెలంగాణ చిన్నమ్మను..: సుష్మా

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్ 2017)లో సుష్మా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ ఎన్నో అవకాశాలకు కేంద్రమని తెలిపారు.

TNN 28 Nov 2017, 7:33 pm
మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా దేశాల మైత్రి మరింత బలపడుతుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఈ దిశగా అమెరికా చూపిస్తున్న చొరవ ప్రశంసదాయకమని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్ 2017)లో సుష్మా ‘ఓట్ ఆఫ్ థ్యాంక్స్’ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ ఎన్నో అవకాశాలకు కేంద్రమని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టామని సుష్మా తెలిపారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనడంతో పాటు ఇండియా-యూఎస్ సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఆమె అభిలషించారు.
Samayam Telugu i am chinnamma for telangana says sushma swaraj addressing ges 2017 hyderabad
నేను తెలంగాణ చిన్నమ్మను..: సుష్మా


సాంప్రదాయ, ఆధునీకరణల పరిపూర్ణ మేళవింపు తెలంగాణ అని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తనకు ఇక్కడి సంస్కృతి సుపరిచితమని.. తనను అందరూ ‘తెలంగాణ చిన్నమ్మ’గా పిలుస్తారని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్‌లో బీజేపీ తరఫున సుష్మా.. తెలంగాణ వాయిస్‌ను బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు ఆమెను ‘తెలంగాణ చిన్నమ్మ’గా పిలుచుకుంటారు.
India's External Affairs Minister Sushma Swaraj delivers a vote of thanks at the opening plenary of #GES2017. pic.twitter.com/Q9MCRbeOEm — GES2017 (@GES2017) November 28, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.