యాప్నగరం

సీఎం వైఎస్ జగన్‌తో పెట్టుకుంటున్నారు!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాను ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్నారు.

Samayam Telugu 27 Jan 2017, 11:31 am
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాను ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్నారు. అంతేకాదు ‘మీరు ముఖ్యమంత్రితో పెట్టుకుంటున్నారు’ అంటూ పోలీసులపై చిందులు తొక్కారు.
Samayam Telugu i am the cm be careful ys jagan warns police at vizag airport
సీఎం వైఎస్ జగన్‌తో పెట్టుకుంటున్నారు!


గురువారం ఘనతంత్ర దినోత్సవ వేళ ఆయన విశాఖలో హల్ చల్ చేశారు. ఏపీకీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖ బీచ్ లో ఆందోళన చేయడానికి పార్టీ నేతలతో వచ్చిన ఆయన్ను పోలీసులు ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై పరుష పదజాలం వాడారు.
ఎయిర్ పోర్టులో విమానం దిగి బయటి వస్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో ‘‘మీరు ముఖ్యమంత్రితో పెట్టుకుంటున్నారు. రెండే రెండు సంవత్సరాలు..నేను చెబుతున్నాను..ఎవర్నీ మరిచిపోను నేను...’’ అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఇలా వార్నింగ్ ఇస్తున్న సమయంలో పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ‘‘గుర్తు పెట్టుకొని, గుర్తు పెట్టుకొని మరి’’ అంటూ తమ అధినేతకు అందిస్తూ... ఖాకీలను హెచ్చరించారు.

డోమెస్టిక్ అరైవల్ నుంచి అనుమతించాలని పోలీసులను హెచ్చరిస్తూ...బుద్దుందా మీకు..మీరేం చేస్తున్నారో తెలియట్లేదా..ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎలా ఉన్నారయ్యా..?’’ అంటూ జగన్ ఫైర్ అయ్యారు.

అనంతరం జగన్, విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు తదతరులు రన్ వేపై బైఠాయించి నిరసన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.