యాప్నగరం

గత ఎన్నికల్లో నష్టపోయా, టిక్కెట్ ఇవ్వండి

గత ఎన్నికల్లో నష్టపోయా. నంద్యాల ఉప ఎన్నికలో టిక్కెట్ కేటాయించండి అంటూ టీడీపీ నేత శిల్పా మోహన్ టీడీపీ అధినేత,

Samayam Telugu 30 Apr 2017, 2:41 pm
గత ఎన్నికల్లో నష్టపోయా. నంద్యాల ఉప ఎన్నికలో టిక్కెట్ కేటాయించండి అంటూ టీడీపీ నేత శిల్పా మోహన్ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు కోరారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల సీటు ఖాళీ అయింది. ఈ స్థానం నుంచి భూమా వర్గం (కుటుంబీకులు) నుంచే పోటీ చేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదే విషయంపై భూమా కూతురు, ఏపీ మంత్రి అఖిలప్రియ చంద్రబాబును కలిశారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకే తమ వర్గానికే అవకాశం ఇవ్వాలని కోరారు.
Samayam Telugu i lost in last election give me ticket shilpa mohanrreddy to cbn
గత ఎన్నికల్లో నష్టపోయా, టిక్కెట్ ఇవ్వండి


అటు శిల్పా మోహన్ రెడ్డి సైతం టికెట్ తనకు కేటాయించాలని బాబును కోరారు. అయితే బాబు మాత్రం ఇంకే నిర్ణయం తీసుకోలేదు. అమెరికా పర్యటన అనంతరం నంద్యాల టికెట్ విషయంలో నిర్ణయం తీసుకుంటానని బాబు తనకు హామీ ఇచ్చారని శిల్పా ఆదివారం మీడియాతో చెప్పారు.

టిక్కెట్ ఎవరికి వచ్చినా గెలుపు కోసం పనిచేస్తానని, అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి నష్టపోయానని... అందుకే ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కోరినట్లు మోహన్ రెడ్డి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.