గత ఎన్నికల్లో నష్టపోయా. నంద్యాల ఉప ఎన్నికలో టిక్కెట్ కేటాయించండి అంటూ టీడీపీ నేత శిల్పా మోహన్ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు కోరారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల సీటు ఖాళీ అయింది. ఈ స్థానం నుంచి భూమా వర్గం (కుటుంబీకులు) నుంచే పోటీ చేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదే విషయంపై భూమా కూతురు, ఏపీ మంత్రి అఖిలప్రియ చంద్రబాబును కలిశారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకే తమ వర్గానికే అవకాశం ఇవ్వాలని కోరారు.
అటు శిల్పా మోహన్ రెడ్డి సైతం టికెట్ తనకు కేటాయించాలని బాబును కోరారు. అయితే బాబు మాత్రం ఇంకే నిర్ణయం తీసుకోలేదు. అమెరికా పర్యటన అనంతరం నంద్యాల టికెట్ విషయంలో నిర్ణయం తీసుకుంటానని బాబు తనకు హామీ ఇచ్చారని శిల్పా ఆదివారం మీడియాతో చెప్పారు.
టిక్కెట్ ఎవరికి వచ్చినా గెలుపు కోసం పనిచేస్తానని, అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి నష్టపోయానని... అందుకే ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కోరినట్లు మోహన్ రెడ్డి తెలిపారు.
అటు శిల్పా మోహన్ రెడ్డి సైతం టికెట్ తనకు కేటాయించాలని బాబును కోరారు. అయితే బాబు మాత్రం ఇంకే నిర్ణయం తీసుకోలేదు. అమెరికా పర్యటన అనంతరం నంద్యాల టికెట్ విషయంలో నిర్ణయం తీసుకుంటానని బాబు తనకు హామీ ఇచ్చారని శిల్పా ఆదివారం మీడియాతో చెప్పారు.
టిక్కెట్ ఎవరికి వచ్చినా గెలుపు కోసం పనిచేస్తానని, అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి నష్టపోయానని... అందుకే ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కోరినట్లు మోహన్ రెడ్డి తెలిపారు.