యాప్నగరం

పొట్లాలు కట్టేటోళ్లు.. వారితో చర్చలా: ఐలయ్య

వైశ్యులను కించపరిచేలా ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం రాసి వివాదానికి తెరతీసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోసారి తన నోటికి పనిచెప్పారు.

TNN 9 Oct 2017, 10:23 am
వైశ్యులను కించపరిచేలా ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం రాసి వివాదానికి తెరతీసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోసారి తన నోటికి పనిచెప్పారు. వైశ్యులు పుస్తకాలను చింపి పొట్లాలు కట్టుకునేటోళ్లని, పుస్తకాలు రాసే మేధావినైన తాను.. వారితో చర్చలకు రానని ఐలయ్య అన్నారు. ఆర్యవైశ్య సంఘాలు ఆదివారం తన నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తనను ఎన్నో రకాలుగా అమానించారని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu i never discuss with vysyas says kancha ilaiah
పొట్లాలు కట్టేటోళ్లు.. వారితో చర్చలా: ఐలయ్య


‘నా పుస్తకంపై మేధావులతో జేఎన్‌యూలో చర్చకు సిద్ధం. దేశంలోని ఆర్థిక శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దీన్ని నిర్వహించాలి. దేశంలో అతిపెద్ద సామాజిక స్మగ్లింగ్ డీమానిటైజేషన్. రచయితగా నాపై భిన్నాభిప్రాయాలు ఉంటే చట్టపరంగా కోర్టుల ద్వారా శిక్షించండి. రాష్ట్రానికి గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రోశయ్య ఒక కులానికి సంబంధించిన సమావేశంలో నన్ను విమర్శించడమేంటి? కోమట్లు సామాజిక స్మగ్లరన్నది నేను సృంచింది కాదు. అంతకుముందే ఎకనామిక్ టైమ్స్‌లో ఆర్థిక సూత్రాలు రాసే వ్యక్తి అధ్యయం చేసి రాశారు. దాని ఆధారంగానే నేను రాశాను’ అని ఐలయ్య చెప్పుకొచ్చారు.

తమను అవమానించే విధంగా పుస్తకం రాయడాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్యులు హైదరాబాద్ తార్నాకలోని ఐలయ్య ఇంటిని ముట్టడించడానికి వెళ్లారు. అయితే ఈ సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు.. ఐలయ్య ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇంటి ముట్టడికి యత్నించిన వారిని అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.