యాప్నగరం

జేసీ సోదరుడు కూడా పోటీకి నో!

తను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

Samayam Telugu 13 Aug 2018, 3:32 pm
తను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి తను తప్పుకుంటున్న విషయాన్ని ప్రకటించారు. ఇదే సమయంలో తన స్థానంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఎవరో కూడా ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం విశేషం. తన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఈ విధంగా తను తప్పుకుని తనయుడికి అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పారు.
Samayam Telugu JCprabhakarReddy


ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ దివాకర్ రెడ్డి రిటైర్మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయనని ప్రకటించారు. తన స్థానంలో తన తనయుడు జేసీ పవన్ పోటీ చేస్తారని దివాకర్ రెడ్డి కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు.

ఇలా జేసీ బ్రదర్స్ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. తమ స్థానాల్లో తమ తనయులు పోటీ చేస్తారని కూడా వీరు ప్రకటించేయడం విశేషం. తనయులకు అవకాశం కల్పించడానికి వీరు ఇరువురూ తప్పుకుంటున్నట్టుగా స్పష్టం అవుతోంది.

ఇక జేసీ కుటుంబం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తుందా? అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఉన్న ఒక చర్చ. ఇటీవల ఈ అంశంపై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తన తనయుడు తెలుగుదేశం పార్టీ తరఫునే అనంతపురం ఎంపీగా చేస్తారని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.