యాప్నగరం

చంద్రబాబును జైలుకు పంపే వరకు నిద్రపోను: విజయసాయి రెడ్డి

‘‘చంద్రబాబును జైలుకు పంపేవరకు నిద్రపోను. అవసరమైతే ప్రధాని మోదీని మరో 10 సార్లు కలుస్తా’’ అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు

Samayam Telugu 30 Apr 2018, 9:50 am
ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయంటూ వైసీపీ నేతలు విశాఖపట్నంలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ చేపట్టారు. ఇటీవల తమ పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీలతో పాటు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనగా నల్లదుస్తులు ధరించారు.
Samayam Telugu 30aaaaa


ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించేవరకు నిద్రపోనని తెలిపారు. దేశంలో హవాలా, విదేశాల్లో ఆర్మ్‌డ్ డీలర్లతో బాబుకు సంబంధాలున్నాయని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అధర్మ సభ అని అన్నారు.

అవసరమైతే మరో 10 సార్లు ప్రధానిని కలుస్తా: ‘‘నేను ప్రధానమంత్రి మోదీని కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను ప్రధానిని కలిసింది నిజమే. ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా గురించి తెలిపేందుకు ఆయన్ను కలిశా. అవసరమైతే మరో 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తా. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రికి ఆధారాలు సమర్పిస్తా. బాబును జైల్లో పెట్టించే వరకు నిద్రపోను’’ అని విజయసాయి రెడ్డి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.