యాప్నగరం

ఐ 10 న్యూస్ ఛానెల్ నయీందే!

గ్యాంగ్‌స్టర్ నయీం చేసిన అక్రమాలు, అన్యాయాలు, బెదిరింపులు, హత్యలు ఆయన చనిపోయాక కుప్పలుకుప్పలుగా బయటపడుతున్నాయి.

TNN 27 Aug 2016, 3:00 pm
గ్యాంగ్‌స్టర్ నయీం చేసిన అక్రమాలు, అన్యాయాలు, బెదిరింపులు, హత్యలు ఆయన చనిపోయాక కుప్పలుకుప్పలుగా బయటపడుతున్నాయి. అతని అనుచరులు, నేరాలతో సంబంధం ఉన్నవారిని కూడా పోలీసులు వెతికి మరీ పట్టుకుంటున్నారు. తాజాగా మొన్నటికి మొన్న నయీంతో సంబంధాలున్నాయంటూ ఇంకా ప్రారంభదశలో ఉన్న ఐ-10 ఛానల్ సీఈవో హరిప్రసాద్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఆయనను విచారణ చేశాక మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐ-10 పేరుకే హరిప్రసాద్ సీఈవో. ఆ టీవీ ఛానల్ పెట్టమన్నది, అందుకు కావాల్సిన డబ్బును ఇచ్చింది నయీమే. ఆ విషయాన్ని హరిప్రసాద్ పోలీసులకు తెలిపాడు. మొదట పదమూడున్నర లక్షలు ఇచ్చినట్టు చెప్పాడు. అనంతరం మరో లక్షన్నర ఇచ్చినట్టు చెప్పాడు. మావోయిస్టు వ్యతిరేక వార్తలు ఎక్కువగా కవర్ చేయడానికే నయీం టీవీ ఛానల్ పెట్టించినట్టు చెప్పాడు.
Samayam Telugu i10 news channel belongs to nayeem says ceo hariprasad reddy
ఐ 10 న్యూస్ ఛానెల్ నయీందే!

హరిప్రసాద్ రెడ్డి గతంలో జర్నలిస్టుగా పనిచేశాడు. అతను నయీంకు వ్యతిరేకంగా వార్తలు రాసేవాడు. నయీం అతడిని పిలిపించుకుని మాట్లాడి... తన మనిషిగా మార్చుకున్నాడు. అప్పట్నించి ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. నయీంతో మాట్లాడడానికి ప్రత్యేకంగా ఫోన్, సిమ్ ఉపయోగించాడు హరిప్రసాద్. నయీం ఎన్ కౌంటర్ అయ్యాక ఆ ఫోన్ ను మూసీలో విసిరేసినట్టు చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.