నగదు రహిత గ్రామం అంటే ఇదేనా? హరీషా!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నగదు రహిత గ్రామం ఇబ్రహీం పూర్లో చాలా వరకు ఇంకా నగదు చెల్లింపులతోనే లావాదేవీలు జరుగుతున్నట్లు తేలింది.
Samayam Telugu 15 Dec 2016, 10:26 am
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నగదు రహిత గ్రామం ఇబ్రహీం పూర్లో చాలా వరకు ఇంకా నగదు చెల్లింపులతోనే లావాదేవీలు జరుగుతున్నట్లు తేలింది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం...సగమంది నిరక్షరాస్యులే కావడంతో...డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించడం లేదు.
ఇబ్రహీంపూర్...సిద్ధిపేట జిల్లాలోని ఓ గ్రామం.300 కుటుంబాలు..1,200 జనాభా.. ఇందులో చదువుకున్నవారు 543 మంది. ఇంటింటికి ఇంకుడు గుంత, మరుగుదొడ్డి..గ్రామమంతా నాటిక లక్ష మొక్కలు.. ఎటు చూసిన పచ్చదనం కనిపిస్తోంది. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్..ఇలా మౌలికవసతుల కల్పనలో ముందున్న ఈ గ్రామం..ఎన్నో ఊళ్లకు ఆదర్శంగా నిలిచింది. భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు దత్తత తీసుకున్న ఈ గ్రామాన్ని....ఇటీవలే తెలంగాణలో మొదటి నగదు రహిత (క్యాష్ లెస్) గ్రామంగా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ధసయ్ గ్రామం మొదటి నగదు రహిత గ్రామంగా నిలవగా..ఇబ్రహీంపూర్ దక్షిణ భారతదేశం, తెలంగాణలోనే తొలిగ్రామంగా రికార్డులకెక్కింది.
ప్రభుత్వ ప్రకటనల వరకు, నేతలు చెబుతున్న గొప్పల వరకు బాగానే ఉన్నా..వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘సాక్షి’ జరిపిన పరిశోధనలో క్యాష్ లెస్ విలేజ్ కేవలం..ప్రకటనలకే పరిమితంగా మారిందనేది స్పష్టంగా అర్థమవుతోంది.
వ్యవసాయ, బీడీ కార్మికులే అత్యధికంగా నివసించే ఈ గ్రామంలో అధికారులు 1,117 మంది రూపే కార్డులు జారీ చేశారు. గ్రామంలో ఉన్న 12 దుకాణాలకు అధికారులు అందజేసి పీవోఎస్ మిషన్లు అందించారు. అయితే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం..,ఇంగ్లిష్ మొబైళ్లకు వచ్చేసందేశాలను అర్థం చేసుకోలేకపోవడంతో...ప్రజలు డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగించడం లేదు. నిత్యవసర వస్తువులు, కిరణ దుకాణం దార్లుసైతం చెలామణీలో ఉన్న నోట్లనే తీసుకుంటున్నారు. పాల కేంద్రాల్లో నగదు లావాదేవీలే జరుగుతున్నాయి.
స్వైపింగ్ మిషన్ల ఆపరేటింగ్ తెలియక..కొందరు దుకాణందార్లు వాటిని బ్యాంకులకు వాపస్ చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు చాలామంది వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. వృద్ధులు, చిన్నపిల్లలు నిత్యం కొనుగోలు చేసే వివిధ రకాల వస్తువులు నగదు చెల్లించే తెచ్చుకుంటున్నారు. ఉప్పులు, పప్పులు, కూరగాయాలు ఇంకా నగదు చెల్లించే కొనుగోలు చేస్తున్నారు.
నగదు కోసం సమీపంలోని నారాయణరావు పేట, సిద్ధిపేటకు వెళ్లి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఆటో రిక్షాల్లో నగదు చెలామణీలోనే ఉంది.
తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు సిద్ధిపేటలోని హోల్ సేల్ దుకాణం దార్ల వద్ద స్వైపింగ్ కార్డులు లేకపోవడంతో..తాము కూడా నగదు స్వీకరించాల్సి వస్తుందని ఇబ్రహీంపూర్ గ్రామంలో కిరాణం దుకాణం నడిపే కమటం రామస్వామి చెబుతున్నారు.
ఇబ్రహీంపూర్...సిద్ధిపేట జిల్లాలోని ఓ గ్రామం.300 కుటుంబాలు..1,200 జనాభా.. ఇందులో చదువుకున్నవారు 543 మంది. ఇంటింటికి ఇంకుడు గుంత, మరుగుదొడ్డి..గ్రామమంతా నాటిక లక్ష మొక్కలు.. ఎటు చూసిన పచ్చదనం కనిపిస్తోంది. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్..ఇలా మౌలికవసతుల కల్పనలో ముందున్న ఈ గ్రామం..ఎన్నో ఊళ్లకు ఆదర్శంగా నిలిచింది. భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు దత్తత తీసుకున్న ఈ గ్రామాన్ని....ఇటీవలే తెలంగాణలో మొదటి నగదు రహిత (క్యాష్ లెస్) గ్రామంగా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ధసయ్ గ్రామం మొదటి నగదు రహిత గ్రామంగా నిలవగా..ఇబ్రహీంపూర్ దక్షిణ భారతదేశం, తెలంగాణలోనే తొలిగ్రామంగా రికార్డులకెక్కింది.
ప్రభుత్వ ప్రకటనల వరకు, నేతలు చెబుతున్న గొప్పల వరకు బాగానే ఉన్నా..వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘సాక్షి’ జరిపిన పరిశోధనలో క్యాష్ లెస్ విలేజ్ కేవలం..ప్రకటనలకే పరిమితంగా మారిందనేది స్పష్టంగా అర్థమవుతోంది.
వ్యవసాయ, బీడీ కార్మికులే అత్యధికంగా నివసించే ఈ గ్రామంలో అధికారులు 1,117 మంది రూపే కార్డులు జారీ చేశారు. గ్రామంలో ఉన్న 12 దుకాణాలకు అధికారులు అందజేసి పీవోఎస్ మిషన్లు అందించారు. అయితే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం..,ఇంగ్లిష్ మొబైళ్లకు వచ్చేసందేశాలను అర్థం చేసుకోలేకపోవడంతో...ప్రజలు డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగించడం లేదు. నిత్యవసర వస్తువులు, కిరణ దుకాణం దార్లుసైతం చెలామణీలో ఉన్న నోట్లనే తీసుకుంటున్నారు. పాల కేంద్రాల్లో నగదు లావాదేవీలే జరుగుతున్నాయి.
స్వైపింగ్ మిషన్ల ఆపరేటింగ్ తెలియక..కొందరు దుకాణందార్లు వాటిని బ్యాంకులకు వాపస్ చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు చాలామంది వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. వృద్ధులు, చిన్నపిల్లలు నిత్యం కొనుగోలు చేసే వివిధ రకాల వస్తువులు నగదు చెల్లించే తెచ్చుకుంటున్నారు. ఉప్పులు, పప్పులు, కూరగాయాలు ఇంకా నగదు చెల్లించే కొనుగోలు చేస్తున్నారు.
నగదు కోసం సమీపంలోని నారాయణరావు పేట, సిద్ధిపేటకు వెళ్లి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఆటో రిక్షాల్లో నగదు చెలామణీలోనే ఉంది.
తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు సిద్ధిపేటలోని హోల్ సేల్ దుకాణం దార్ల వద్ద స్వైపింగ్ కార్డులు లేకపోవడంతో..తాము కూడా నగదు స్వీకరించాల్సి వస్తుందని ఇబ్రహీంపూర్ గ్రామంలో కిరాణం దుకాణం నడిపే కమటం రామస్వామి చెబుతున్నారు.