యాప్నగరం

మండలి ఎన్నిక: పేరొకరిది ఫొటో మరొకరిది!

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అధికారులు పొరపాటు వల్ల అభ్యర్థుల పేర్లు, ఫొటోలు తారుమారయ్యాయి.

Samayam Telugu 9 Mar 2017, 2:55 pm
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అధికారులు పొరపాటు వల్ల అభ్యర్థుల పేర్లు, ఫొటోలు తారుమారయ్యాయి. ఎన్నికల బ్యాలెట్ లో తప్పులు దొర్లాయి. గురువారం వికారాబాద్ టీచర్ల నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న అభ్యర్థి లక్ష్మయ్య ఫొటో పక్కన మాణిక్ రెడ్డి ముద్రించారు. మాణిక్ రెడ్డి ఫొటో పక్కన లక్ష్మయ్య పేరు ముద్రించి ఉంది. దీంతో గందరగోళం నెలకొంది.
Samayam Telugu images and names of the candidates for teachers mlc election in telangana changed
మండలి ఎన్నిక: పేరొకరిది ఫొటో మరొకరిది!


టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి బ్యాలెట్ పేపర్ ను తప్పులను సవరించి మళ్లీ ముద్రించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోలింగ్ ను రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.

ఇరువురు అభ్యర్థులు ఈ విషయంపై ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ పేపర్లో పొరపాట్లు దొర్లిన సంగతి నిజమేనని అంగీకరించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపుతామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.