యాప్నగరం

ప్రేమోన్మాదం.. యువతిపై కత్తితో దాడి

ప్రేమించాలంటూ రెండేళ్లుగా యువతిని వేధిపస్తున్నాడు.. ఆమె ఒప్పుకోకపోవడంతో పగ పెంచుకున్నాడు.

TNN 26 Jul 2017, 8:28 am
ప్రేమించాలంటూ రెండేళ్లుగా యువతిని వేధిపస్తున్నాడు.. ఆమె ఒప్పుకోకపోవడంతో పగ పెంచుకున్నాడు. ప్రేమోన్మాదిగా మారిన ఆ యువకుడు.. యువతి తల్లిదండ్రుల ముందే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని మీనమోనిపల్లిలో జరిగింది. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చావు బుతుల మధ్య ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మీనామోనిపల్లి గ్రామానికి చెందిన జంగయ్య, పాపమ్మ దంపతుల కుమార్తె సునీత(20). ఆమె కడ్తాల్‌ మండలంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది.
Samayam Telugu in a case of one sided love man attacks woman in telangana
ప్రేమోన్మాదం.. యువతిపై కత్తితో దాడి


తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కాశీ శివకుమార్‌(23) గత రెండేళ్లుగా ప్రేమించాలంటూ సునీత వెంటపడుతున్నాడు. శివకుమార్ వేధింపులు ఎక్కువవుతుండటంతో ఈ విషయాన్ని సునీత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కాశీని మందలించారు. అయినా అతను తీరు మార్చుకోలేదు. అతని వేధింపులకు భయపడి కాలేజీ మానేసిన సునీత.. ఇంటివద్దే ఉంటూ తల్లిదండ్రులతో వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో సునీతపై పగ పెంచుకున్న శివకుమార్‌.. మంగళవారం సొంత పత్తి చేనులో తల్లిదండ్రులు, కూలీలతో కలిసి కలుపు తీస్తున్న సునీతపై వెనుక నుంచి కత్తితో దాడిచేసి పరారయ్యాడు.

దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. కత్తితో వెనక నుంచి పొడవడంతో మూత్రపిండాలకు బలమైన గాయమైనట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావు బతులకుల మధ్య ఉంది. మరోవైపు శివకుమార్ ఆమనగల్లు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. తన కూతురిపై దాడిచేసిన ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని సునీత తల్లిదండ్రులు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.