యాప్నగరం

నూతన ఆలోచనలకు వేదికగా భారత్: కేటీఆర్

పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో యువత అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారని, ఇదే మన బలమని ఆయన పేర్కొన్నారు. భాగ్యనగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా ఆదివారం (నవంబర్ 26) నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జీఈఎస్ 2017 (ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు) సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు.

TNN 26 Nov 2017, 4:43 pm
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో యువత అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారని, ఇదే మన బలమని ఆయన పేర్కొన్నారు. భాగ్యనగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా ఆదివారం (నవంబర్ 26) నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జీఈఎస్ 2017 (ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు) సన్నాహక సదస్సు జరిగింది. సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తదితర ప్రముఖులతో పాటు యువ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నూతన ఆలోచనలకు భారత్ వేదికగా నిలుస్తోందన్నారు.
Samayam Telugu india becomes better platform for creative thinkers says ktr
నూతన ఆలోచనలకు వేదికగా భారత్: కేటీఆర్


నూతన ఆవిష్కరణలకు, పెట్టుబడులకు తెలంగాణ వేదికగా మారిందని కేటీఆర్ చెప్పారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని ఆయన అన్నారు. టీఎస్ ఐపాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ‘ఆవిర్భవించిన మూడున్నరేళ్లలోనే తెలంగాణ.. అభివృద్ధి దిశగా దూసుకెళుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అసవరం ఉంది’ అని మంత్రి అన్నారు.

కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్యం ఖరీదు అయ్యాయని ఆయన అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందినప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నివారణకు అందరూ కృషి చేయాలని, అది సమాజ అభివృద్ధికి నిరోధంగా మారిందని ఆయన చెప్పారు.

దేశంలో ప్రతి గంటకు ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురవుతున్నారని, మరో 10 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారని సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సులో పలువురు యువ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార అనుభవాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో టీహబ్, ఐఎన్‌కే సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.