యాప్నగరం

అమరావతిలో హైపర్‌లూప్.. దేశంలో తొలిసారి!

దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అమరావతి-విజయవాడ మధ్య కేవలం 6 నిమిషాల్లోనే..

TNN 8 Sep 2017, 6:46 pm
విమానం కంటే వేగంగా భూమి మీదే పరుగులు పెట్టే హైపర్‌ లూప్‌ రవాణా వ్యవస్థను ఇండియాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, అమరావతి మధ్య హైపర్ లూప్ ఏర్పాటు చేసే విషయమై అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ (హెచ్‌టీటీ) ఇటీవలే ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. భారతదేశంలో హైపర్ లూప్ నిర్మాణం విషయమై కుదిరిన తొలి అధికారిక ఒప్పందం ఇదే కావడం విశేషం. విజయవాడ నుంచి అమరావతికి ప్రస్తుతం గంటకు పైగా సమయం పడుతుండగా.. హైపర్ లూప్ ద్వారా కేవలం ఆరు నిమిషాల్లో చేరుకోవచ్చు. దీన్ని పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల 2500 ఉద్యోగాలు లభిస్తాయని హెచ్‌టీటీ తెలిపింది.
Samayam Telugu india is going to begin construction of hyperloop in andhra pradesh as early as 2018
అమరావతిలో హైపర్‌లూప్.. దేశంలో తొలిసారి!


వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయి. అంత కంటే ముందుగా.. ఆరు నెలలపాటు ఈ ప్రాజెక్ట్ గురించి అధ్యయనం చేస్తారు. గతంలో హైపర్‌లూప్ వన్ అనే సంస్థ కూడా భారత్‌లో హై స్పీడ్ రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చింది. హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే.. ఢిల్లీ నుంచి ముంబైకి 80 నిమిషాల్లో చేరుకోవచ్చు.


హైపర్‌లూప్‌ రవాణా టెక్నాలజీలో తక్కువ పీడనం ఉన్న గొట్టాల్లో అయస్కాంత క్షేత్రంపై క్యాబిన్లు వేగంగా ప్రయాణిస్తాయి. ఇందులో గంటకు దాదాపు 1200 కి.మీ. వేగంతో ప్రయాణించే వీలుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.