యాప్నగరం

జేసీపై నిషేధం ఎత్తివేసిన ఇండిగో!

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ నిషేధం ఎదుర్కొంటున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఊరట.

TNN 19 Jul 2017, 4:38 pm
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ నిషేధం ఎదుర్కొంటున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఊరట. ఈ టీడీపీ ఎంపీపై ఉన్న నిషేధాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఎత్తివేసింది. ఇది తక్షణమే అమలులోకి రానున్నట్లు ఇండిగో ప్రకటించింది. గత నెలలో విశాఖపట్టణం ఎయిర్ పోర్టు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే కారణంతో ఎంపీ జేసీపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిషేధం విధించింది. తక్షణమే తమ సిబ్బందికి క్షమాపణలు చెప్పాలని కోరింది. దీనికి జేసీ నిరాకరించడంతో అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. దీంతో ఆయన విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది.
Samayam Telugu indigo lifts ban on tdp mp jc diwakar reddy
జేసీపై నిషేధం ఎత్తివేసిన ఇండిగో!


అయితే ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇండిగో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ... నిషేధం ఎత్తివేతకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అయితే తాను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదని స్పష్టం చేశారు. కాగా, సోమవారం రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి జేసీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. సుమారు రూ.7 లక్షలు వెచ్చించి చార్టర్డ్‌ ఫ్లైట్‌ను సొంతంగా బుక్‌ చేసుకుని మరీ విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆ తరవాత పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో కాసేపు మాట్లాడారు. ఎయిర్‌లైన్స్ నిషేధంపైనే వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.