యాప్నగరం

అమ్మ లేదన్న బాధను దిగమింగుకొని.. పరీక్షా కేంద్రానికి

నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన అమ్మ ఇక లేదనే బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యాడు.

TNN 4 Mar 2017, 7:15 pm
నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన అమ్మ ఇక లేదనే బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యాడు. ఆ తర్వాత.. తల్లి అంత్యక్రియలకు తరలివెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్ధిపేట జిల్లాలో చేటుచేసుకుంది. నితీష్‌ రెడ్డి అనే విద్యార్థి హైదరాబాద్‌‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. ఇతడు చిన్నకోడూరు మండలం గంగారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, వాణి దంపతుల కుమారుడు.
Samayam Telugu inter student appears for exam after his mothers death
అమ్మ లేదన్న బాధను దిగమింగుకొని.. పరీక్షా కేంద్రానికి


అతడి తల్లి వాణి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మార్చి 2న ఉదయం ఆమె గుండెపోటుతో మరణించింది. దీంతో నితీష్‌‌ను ఇంటికి తీసుకెళ్లారు అతడి బంధువులు. అతడి సోదరి ఆగ్రాలో ఉన్నత చదువులు చదువుతోంది. ఆమె రాక కోసం.. అంత్యక్రియలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. అదే రోజు ఇంగ్లిష్ పరీక్ష ఉంది. దీంతో నితీష్.. కన్నతల్లి మరణించిందన్న దుఃఖాన్ని దిగమింగుకొని.. హైదరాబాద్ చేరుకొని పరీక్ష రాశాడు. ఆ తర్వాత స్వగ్రామంలో తల్లి అంత్యక్రియలకు వెళ్లాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.