యాప్నగరం

ఆసక్తికరంగా ప్రగతి భవన్ పంచాంగ శ్రవణం

ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. వేడుకల్లో బాచంపల్లి సంతోష్‌కుమార్ శర్మ పంచాగ శ్రవణం చేశారు. ఆయన పలు ఆసక్తికర అంశాలను చెప్పారు.

Samayam Telugu 18 Mar 2018, 3:08 pm
ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. వేడుకల్లో బాచంపల్లి సంతోష్‌కుమార్ శర్మ పంచాగ శ్రవణం చేశారు. ఆయన పలు ఆసక్తికర అంశాలను చెప్పారు. త్వరలో 5 నుంచి 8మంది మంత్రులకు ఇబ్బందులు తప్పవని... మళ్లీ వారికి పదవులు రావడం కష్టమని చెప్పారు. కొన్ని రాశులవారికి ఎమ్మెల్యే సీట్లు దక్కవని హెచ్చరించారు. అలాగే దేవాదాయశాఖలో అవినీతికి ఆస్కారం ఉందని... పశువులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి పశుసంవర్థకశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Samayam Telugu interesting issues in pragati bhavan ugadi panchanga sravanam
ఆసక్తికరంగా ప్రగతి భవన్ పంచాంగ శ్రవణం


అక్టబర్‌లో వానలు... డిసెంబర్‌‌లో వరదలు వస్తాయని సంతోష్‌కుమార్ శర్మ చెప్పారు. సూర్యగ్రహ బలంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు... ఎక్కడైనా చక్రం తిప్పగలరని తెలిపారు. మీడియా వార్తల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. శుక్రప్రభావంతో 365 రోజులూ వార్తలే వార్తలంటూ చివర్లో చమత్కరించారు. అయితే మంత్రులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా కూడా చర్చనీయాంశమయ్యింది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు రావని చెప్పడం కూడా గుబులు రేపుతోంది. ఎందుకంటే సంతోష్‌శర్మ పంచాంగ శ్రవణంపై తెలంగాణలో అందరికి మంచి గురి ఉంది. అందుకే నేతల్లో టెన్షన్ మొదలయ్యిందని టాక్ వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.