యాప్నగరం

మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు హాజరై ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు కేటీఆర్‌కు ఆహ్వానం అందజేశారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో దుబాయ్‌లో ‘బిజినెస్ లీడర్స్ ఫోరమ్’ ఆధ్వర్యంలో ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు.

TNN 17 Oct 2017, 7:19 pm
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు హాజరై ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు కేటీఆర్‌కు ఆహ్వానం అందజేశారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో దుబాయ్‌లో ‘బిజినెస్ లీడర్స్ ఫోరమ్’ ఆధ్వర్యంలో ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి భారత్‌తో పాటు గల్ఫ్‌ దేశాల నుంచి 800ల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు ఇందులో పాల్గొంటారు.
Samayam Telugu invitation to ktr from uae india economic forum 2017
మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం


దుబాయ్, యూఏఈ దేశాలతో భారత వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. 30న జరిగే మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, పర్యాటకం తదితర అంశాలపై ప్రసంగించనున్నారు. సదస్సులో కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి ప్రస్తావిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.