యాప్నగరం

సాగ‌ర్ ఆయ‌క‌ట్టు రైతుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌

నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వ‌చ్చి చేరుతున్న నేపథ్యంలో ఈనెల 22న ఎడమకాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది

Samayam Telugu 18 Aug 2018, 9:41 am
నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వ‌చ్చి చేరుతున్న నేపథ్యంలో ఈనెల 22న ఎడమకాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు నీటి పారుద‌ల శాఖ మంత్రి నిర్ణ‌యిం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. తుంగభద్ర, ఆల్మట్టి వరద ప్రవాహం వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా బేసిన్‌ పరిధిలో ఏయే ప్రాజెక్టుల్లోకి, చెరువుల్లో కి నీరు వచ్చి చేరుతోందో ఆరా తీశారు.
Samayam Telugu తెలంగాణ జ‌ల వ‌న‌రుల మంత్రి హరీశ్‌రావు


భవిష్యత్‌ తాగునీటి అవసరాల కోసం కొంతమేర నిల్వ చేసి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని ఎడమ కాలువ రైతాంగానికి నష్టం కలుగకుండా ఉండేందుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. వరద నీటిని అంచనా వేస్తూ రైతుల ప్రయోజనాలు కాపాడే దిశగా కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్‌ను జిల్లా కలెక్టర్లు, ఇంజనీర్లు, రైతు సమితి నేతలతో చర్చించి నీరు విడుదల చేయాలని హరీశ్‌ అధికారులను ఆదేశించారు. రైతులు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని తమ పంటలకు వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని 28 మీడియం ప్రాజెక్టుల నుంచి 2.94 లక్షల ఎకరాలకు సాగునీటిని ఈ ఖరీఫ్‌ సీజన్‌కు అందించవచ్చని సమీక్షలో నిర్ణయించారు. గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులు 21 ఉండగా, వాటి కింద 1.92 లక్షల ఎకరాల ఆయకట్టు, కృష్ణా బేసిన్‌ పరిధిలో ఏడు ప్రాజెక్టులు ఉండగా వాటి పరిధిలో 1.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని ఇంజనీర్లను హరీశ్‌రావు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.