యాప్నగరం

అమెరికా పర్యటనలో బిజీగా కేటీఆర్..

నోకియా, ఎరిక్సన్‌ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు..

TNN 24 May 2017, 4:40 pm
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతోంది. ఆయన ఇవాళ (మే 24) వివిధ పారిశ్రామిక వర్గాలతో వరస సమావేశాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలో యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, టీఎస్‌ ఐపాస్‌ ప్రత్యేకతలు, ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను ఆయన తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు.
Samayam Telugu it minister ktr invites investments to telangana
అమెరికా పర్యటనలో బిజీగా కేటీఆర్..


నోకియా, ఎరిక్సన్‌ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని నోకియా ప్రతినిధులను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన నోకియా.. ఫైబర్‌ గ్రిడ్‌ కోసం జారీ చేయబోయే ఆర్‌ఎఫ్‌పీలో పాల్గొంటామని హామీ ఇచ్చింది. డేటా అనలిటిక్స్‌ పార్కులో మొబైల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

సేల్స్‌ ఫోర్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై, మేక్‌ ఇన్‌ ఇండియాతో పాటు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కేటీఆర్ చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.